byసూర్య | Fri, Oct 11, 2019, 04:15 PM
పుణె వేదికగా ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్లో సౌతాఫ్రికా 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్క్రామ్ రెండు బంతులు ఆడి ఎలాంటి పరుగులు చేయకుండా వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో మార్క్రామ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రియా 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (2), డి బ్రూయెన్(2) క్రీజులో ఉన్నారు.