byసూర్య | Fri, Oct 11, 2019, 04:10 PM
తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇబ్రహీపట్నం మండలం మంగళ్ పల్లిలో లాజిస్టిక్ హబ్ ను ప్రారంభించారు. 60శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కమర్షియల్ ఆపరేషన్ పనులను ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధిలో ఇబ్రహీంపట్నం దూసుకుపోతుందని, త్వరలో అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ ఏర్పాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 22 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో దేశంలోనే మొదటి పార్క్ గా అందుబాటులో తెచ్చామన్నారు. త్వరలో బాట సింగారంలో లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభంకానుందని తెలిపారు.