byసూర్య | Sat, Aug 24, 2019, 07:13 PM
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిపారసు చేసిన హైకోర్టు న్యాయవాదులు అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి, తడకమళ్ల వినోద్ కుమార్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కూనూరు లక్ష్మణ్ను నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ముగ్గురు కూడా వచ్చే వారంలో ప్రమాణం చేయనున్నారు. కొత్త న్యాయమూర్తుల నియామకంతో తెలంగాణ హైకోర్టులో నాయ్యమూర్తుల సంఖ్య 14కు పెరిగింది. మరో 10 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.