byసూర్య | Sat, Aug 24, 2019, 07:08 PM
అమ్రాబాద్ మండలం దోమలపెంట చెక్పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ద్విచక్రవాహనం చెట్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హైదరాబాద్కు చెందిన సంతోష్గా గుర్తించారు.