byసూర్య | Sat, Aug 24, 2019, 07:16 PM
అగ్రిగోల్డ్ కుంభకోణాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిశోర్కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్కు చెందిన మొత్తం ఆస్తుల్లో 88 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థలో డిపాజిట్లు చేసిన వారిలో సుమారుగా 66 శాతం మంది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న ఏజెంట్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.7.10 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.10 వేలు అంతకంటే తక్కువ మొత్తం డిపాజిటర్లకు చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందన్నారు.