byసూర్య | Sun, Aug 18, 2019, 09:26 AM
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో పదాధికారులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బహిరంగసభకు నడ్డా హాజరుకానున్నారు. సభలో జేపీ నడ్డా సమక్షంలో పలువురు టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో నడ్డా పాల్గొననున్నారు.