byసూర్య | Mon, Jun 24, 2019, 12:41 PM
జూబ్లీహిల్స్ పరిధి జవహర్నగర్లో ఫుడ్ డెలివరి బాయ్పై కొందరు యువకులు దాడి చేశారు. రోడ్డుకు వ్యతిరేక దిశలో రావడంపై డెలివరీ బాయ్ శివశంకర్ను సాయికుమార్ అనే వ్యక్తి మందలించాడు. కాగా రాత్రి మరోసారి శివశంకర్తో సాయికుమార్, అతడి స్నేహితులు ఘర్షణపడ్డారు. వీరి దాడిలో శివశంకర్కు గాయాలయ్యాయి. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయికుమార్ను అదుపులోకి తీసుకున్నారు.