byసూర్య | Mon, Jun 24, 2019, 12:38 PM
హైదరాబాద్ లోని మెట్రో రైళ్లలో మరోసారి సాంకేతిక లోపం ఏర్పడింది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రైళ్లు ఆలస్యమయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 స్టేషన్ లో మెట్రో రైలు ఆగింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందని సిబ్బంది తెలిపారు. అమీర్ పేట – హైటెక్ మార్గంలో మెట్రో రైళ్లు నిదానంగా నడుస్తున్నాయి.