byసూర్య | Sun, Jun 23, 2019, 08:08 PM
అనాధాశ్రమంలోని అనాధ యువతికి తండ్రిగా మారి కన్యాదానం చేసి వివాహం జరిపించి తన గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి మల్లారెడ్డి. బహుదూర్ పల్లిలోని గౌరీ అనాధాశ్రమంలో పెరిగిన పుష్ప అనే యువతికి విజయవాడ కు చెందిన కిషోర్ అనే వ్యక్తితో వివాహాం నిశ్చయమయ్యింది. ఈ వివాహానికి అన్నీ తామై దగ్గరుండి వివాహాం జరిపించారు మల్లారెడ్డి దంపతులు. 2019 జూన్ 23 ఆదివారం జరిగిన ఈ వివాహానికి వధువు తల్లితండ్రుల స్ధానంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు కూర్చుని కన్యాదానం చేశారు. అంతే కాదు అమ్మాయి పేరున రూ.2.35.000 ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలను వధువుకు బహుమతిగా ఇచ్చారు. నూతన దంపతులకు రూ. 25 వేల రూపాయలు నగదును బహుమతిగా అందచేశారు. వివాహానికి వచ్చిన పెద్దలకు పెళ్లి ఖర్చులు ఇచ్చి కన్యాదానం చేసిన మంత్రి మల్లారెడ్డి దంపతులకు ఆశ్రమ నిర్వాహకులు వధూ వరులు కృతజ్ఞతలు తెలిపారు.