అనాధ యువతికి కన్యాదానం చేసిన‌ మంత్రి మల్లారెడ్డి!

byసూర్య | Sun, Jun 23, 2019, 08:08 PM

అనాధాశ్రమంలోని అనాధ యువతికి తండ్రిగా మారి కన్యాదానం చేసి వివాహం జరిపించి తన గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి మల్లారెడ్డి. బహుదూర్ పల్లిలోని గౌరీ అనాధాశ్రమంలో పెరిగిన పుష్ప అనే యువతికి విజయవాడ కు చెందిన కిషోర్ అనే వ్యక్తితో వివాహాం నిశ్చయమయ్యింది. ఈ వివాహానికి అన్నీ తామై దగ్గరుండి వివాహాం జరిపించారు మల్లారెడ్డి దంపతులు. 2019  జూన్ 23 ఆదివారం జరిగిన  ఈ  వివాహానికి వధువు తల్లితండ్రుల స్ధానంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు కూర్చుని కన్యాదానం చేశారు. అంతే కాదు అమ్మాయి పేరున రూ.2.35.000  ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలను వధువుకు బహుమతిగా ఇచ్చారు. నూతన దంపతులకు రూ. 25 వేల రూపాయలు నగదును బహుమతిగా అందచేశారు. వివాహానికి వచ్చిన పెద్దలకు పెళ్లి ఖర్చులు ఇచ్చి కన్యాదానం చేసిన మంత్రి మల్లారెడ్డి దంపతులకు ఆశ్రమ నిర్వాహకులు వధూ వరులు కృతజ్ఞతలు తెలిపారు. 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM