byసూర్య | Sun, Jun 23, 2019, 03:02 PM
చదువుల సరస్వతి నెలవైన బాసరలో రోజు వేల సంఖ్యలో తల్లిదండ్రులు అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అనేక విద్యలు వస్తాయన్న నమ్మకంతో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రసాదం విషయంలో బాసర ఆలయ కమిటి పర్యవేక్షణాలోపం అనేక సార్లు వివాదాలకు తావిచ్చింది. తాజాగా బాసర లడ్డూ ప్రసాదంలో పురుగులు బయటపడటంతో మరోమారు వార్తలలోకి ఎక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే శనివారం హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కుటుంబ సమేతంగా బాసరలోని సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదం కౌంటర్లో లడ్డు ప్రసాదాన్ని కొన్నారు. తీరా లడ్డు విరచి చూడగా బొద్దింక కనపడటంతో షాక్కు గురయ్యారు. ఈ విసయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లైట్ తీస్కో... అన్నట్టు మాట్లాడారని భక్తులు ఆరోపిస్తుంటే.... ఆలయ అధికారులు లడ్డూ తయారీలో నాణ్యతను పాటిస్తున్నామని, బొద్దింక లడ్డులో కలిసిందనటం సరికాదని బుకాయిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా, చర్యలు లేవని. ఇప్పటికైనా సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.