byసూర్య | Sun, Jun 23, 2019, 02:50 PM
హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాజస్థాన్ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉపరితలద్రోణి వ్యాపించి ఉంది. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, కూకట్పల్లి, మల్లాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కోంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్, షాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది.