byసూర్య | Wed, Jun 19, 2019, 01:59 PM
గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శుభవార్త వినిపించారు. జులై మొదటి వారంలో గ్రూప్-2 ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి స్పష్టం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను ఘంటా చక్రపాణి కలిసి టీఎస్పీఎస్సీ 2017-18 వార్షిక నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు 2 వేలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, ఇంటర్వ్యూలన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్టీ జాబితా ఎంపిక పూర్తయింది.. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపామని చెప్పారు. విద్యాశాఖ ఆమోదించగానే త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.