byసూర్య | Thu, Mar 21, 2019, 07:04 PM
సాధారణ సెలవు రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండదు.21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం కావటంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని అధికారులు సూచించారు. లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయటానికి ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ, ఇందులో మూడు సాధారణ సెలవురోజులు ఉన్నాయి. .