byసూర్య | Tue, Mar 19, 2019, 10:04 AM
హోలీ వేడుకల్లో బలవంతంగా రంగులు చల్లితే చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. రోడ్లు, జనం సంచరించే ప్రాంతా ల్లో బలవంతంగా రంగులు చల్లడంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 22న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మద్యం, కల్లు దుకాణాలూ మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనాలపై గుంపులుగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని సూచించారు.