గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Sun, Mar 17, 2019, 11:11 AM

 వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎన్‌ రెడ్డి నగర్ నుంచి గుర్రంగూడ గేటు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు వంశీ(20), సాయి(20) గుర్రంగూడకు చెందిన విద్యార్థులు కాగా.. వనస్థలిపురానికి చెందిన గణేష్(21) అనే మరో యువకుడు ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM