పవన్ కల్యాణ్ రూపంలో సరైనోడు వచ్చాడు : విజయశాంతి

byసూర్య | Sun, Mar 17, 2019, 11:21 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమ్మున్న మగాడు ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడేనని కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. రాజమండ్రిలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది ఆంధ్రుల హృదయవేదనగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.


ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బీజేపీకి బినామీగా మారి ఏపీలో అడుగుపెట్టాలని చూస్తున్న కేసీఆర్‌ను సీమాంధ్రులు ఎప్పటికీ అంగీకరించరన్నారు. ఇన్నాళ్లు కేసీఆర్‌కు సీమాంధ్రలో సరైన ప్రత్యర్థి లేరని చెప్పుకునేవాళ్లని, కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ రూపంలో సరైనోడు వచ్చాడన్నారు.కేసీఆర్ ఒంటెద్దు పోకడలను, నియంత ధోరణులను ప్రశ్నించడం ద్వారా తానేంటో నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం ఏంటని పవన్ నిలదీసిన వైనం ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెచప్పుడుగా భావించాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు.


 


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM