byసూర్య | Mon, Jan 21, 2019, 11:39 AM
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహౌజ్లో యాగశాల వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. మరికాసేపట్లో సహస్ర మహాచండీ యాగం ప్రారంభం కానుంది. యాగశాల వద్దకు ఎంపీ కవిత, ఒంటేరు ప్రతాప్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, హోంమంత్రి మహమూద్అలీలు చేరుకున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా యాగశాలకు చేరుకున్నారు. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో యాగం నిర్వహించనున్నారు. ఐదు రోజులపాటు జరగనున్న యాగంలో 300 మంది రుత్వికులు పాల్గొననున్నారు.