byసూర్య | Sat, Jan 19, 2019, 04:27 PM
హైదరాబాద్ : సిమ్ స్వాపింగ్ కు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఇద్దరు నైజీరియన్లు, ఐదుగురు కోల్కతా వాసులు ఉన్నారు. కాగా ప్రధాన నిందితుడు జేమ్స్(నైజీరియన్) పరారీలో ఉన్నాడు. నైజీరియా కేంద్రంగా సిమ్ స్వాపింగ్ సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.