byసూర్య | Sat, Jan 19, 2019, 03:25 PM
సీఎం కేసీఆర్ ను ఆదివాసీ ఎమ్మెల్యేలు కలిశారు. భేటీ సందర్భంగా ఎమ్మెల్యేలు పోడు భూముల సమస్యను సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం ఫిబ్రవరి మొదటివారంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో గిరిజన, గిరిజనేతర భూముల సమస్యలు పరిష్కరించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.