byసూర్య | Sat, Jan 19, 2019, 05:35 PM
సీఎల్పీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుందని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకుడు.. ఆయన్ను సీఎల్పీ గా నియమించి మంచి సందేశం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేతగా భట్టిని నియమించి బడుగు వర్గాలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని సర్వే చెప్పుకొచ్చారు. పీసీసీని కూడా ప్రక్షాళన చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీని బ్రష్టు పట్టించిన ఉత్తమ్ కు సీఎల్పీ ఇవ్వడం అధిష్టానానికి ఇష్టం లేదని తేలిందని, రేపో, మాపో పిసిసి పదవి పోతుందని చెప్పారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ఓటమి తప్పదని, తన ఓటమికి ఆయన కూడా కుట్ర చేశారని సర్వే సత్యనారాయణ ఆరోపించారు.