byసూర్య | Sat, Jan 19, 2019, 11:02 AM
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి వెళ్ళాల్సిన స్పైస్ జెట్ విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులోనే నిలిపివేశారు. శనివారం తెల్లవారుజామున ఫ్లైట్ బయలుదేరాల్సి ఉంది. అయితే ఫ్లైట్ బయలుదేరే సమయానికి రెండు ఇంజన్లలో ఓ ఇంజన్ పని చేయకపోవడంతో నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విమానంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ఉన్నట్లు సమాచారం.