byసూర్య | Thu, Jan 17, 2019, 11:52 AM
హైదరాబాద్: స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిన్న ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు ఫోన్ చేశారు. ఎంఐఎం, బీజేపీ.. స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలుపుతున్నట్టు నిన్ననే ప్రకటించారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. పార్టీ నేతలతో చర్చించి వెల్లడిస్తామని చెప్పారు. ఇవాళ పార్టీ నేతలతో జరిగిన సమావేశం అనంతరం స్పీకర్ ఎంపిక ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. దీంతో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది. స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు ఉంటాయి. రేపు స్పీకర్ ఎన్నిక ఉండనుంది.