byసూర్య | Thu, Jan 17, 2019, 11:53 AM
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. శాసనసభ కమిటీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ భేటీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీ కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ కాంగ్రెస్ నేతలు ఏకవాఖ్య తీర్మానం చేశారు. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.