కోలీవుడ్ లో 'అంధాధున్' రీమేక్

by సూర్య | Fri, Aug 16, 2019, 06:27 PM

బాలీవుడ్‌లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం `అంధాధున్`. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. జీన్స్, జోడి చిత్రాల ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ `అంధూధున్` రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఇటీవల రామ్‌చరణ్ హీరోగా నటించిన `వినయవిధేయరామ` చిత్రంలో ప్రశాంత్ చెర్రీ అన్నయ్య పాత్రలో కనిపించారు. 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM