by సూర్య | Fri, Jun 21, 2019, 03:23 PM
ధ్రువ కుమార్ ప్రధాన పాత్రలో నితిన్. జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అశ్వమేథం’. ప్రాచి, సోన్యా, శివంగి కేదార్, సుమన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించారు. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదల అయింది. ‘నేను నేను కాదు.. నాకు ఉనికి లేదు. నా వృత్తే నాకు ఉనికి లేకుండా చేసింది’ అంటూ హీరో చెప్పే వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమవుతుంది.
చదరంగంలో ప్రావీణ్యమున్న ఒక వ్యక్తి ఊహించని పరిస్థితుల్లో చిక్కుకోవడం.. అనుకోకుండా హత్యలు చేయడం.. తనను ఆ పరిస్థితులకు ప్రేరేపించిన అతీతమైన శక్తిని తెలుసుకునే ప్రయత్నంలో హీరో తలపెట్టిన యజ్ఞమే ‘అశ్వమేథం’. ఈ చిత్ర కాన్సెప్ట్ను చాలా చక్కగా టీజర్లో చిత్రబృందం చూపించింది. టీజర్ను బట్టి చూస్తే సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
Latest News