గొడ‌వ‌ప‌డితే 15రోజులు మాట్లాడుకోం

by సూర్య | Tue, Jun 18, 2019, 01:07 PM

బాలీవుడ్ న‌టి నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజ‌ర‌య్యాడు బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దంపతులన్నకా గొడవలు సహజం. అది మంచిది కూడా. ఒకరితో ఒకరం విభేధించడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థం అవుతుంద‌ని చెప్పాడు. ‘ఇక మా విషయానికోస్తే రెండు మూడు నెలలకోసారి మేం గొడవ పడుతుంటాం. పోట్లాడుకున్నప్పుడు దాదాపు 15 రోజుల పాటు మేం మాట్లాడుకోం. తర్వాత తనో, నేనో సర్దుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలవుతుంద‌ని తెలిపాడు.

Latest News
 
'వార్ 2' నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Sat, May 04, 2024, 04:26 PM
150 కోట్ల మార్క్ దిశగా ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Sat, May 04, 2024, 04:24 PM
దిల్ రాజుతో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం Sat, May 04, 2024, 04:21 PM
'గం గం గణేశా' నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది... Sat, May 04, 2024, 03:57 PM
ప్రభాస్ లేకుండా 'సాలార్ 2' షూటింగ్ ప్రారంభం Sat, May 04, 2024, 03:56 PM