ఏపీ అసెంబ్లీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

by సూర్య | Tue, Jun 18, 2019, 12:20 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతున్న తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. తాను అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే స్కూలు విద్యార్థులు గుర్తుకొస్తున్నారని అన్నారు. "స్పీకర్ పదేపదే బెల్ ను మోగిస్తున్నారు. అలా చేయక తప్పదనుకుంటాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారు" అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ఓ ట్వీట్ ను పెట్టారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు గత వారంలో ప్రారంభం కాగా, తొలి సమావేశాల్లోనే వాడివేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార విపక్ష ఎమ్మెల్యేల మధ్య ప్రతి క్షణం ఏదో ఓ విషయంలో వాగ్వాదం జరుగుతూనే ఉండటం గమనార్హం. 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM