నా జీవితంలో ఎన్నో స్మృతులు

by సూర్య | Tue, Oct 22, 2024, 11:17 PM

సౌత్‌ సినిమా ఇండస్ట్రీ లో చూడ ముచ్చటైన అందమైన జోడీల్లో నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ ల జంట ఒకటి. ‘నేను రౌడీనే’  చిత్రంతో వీరిద్దరూ ఒకటయ్యారు. విఘ్నేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి వివాహబంధం వరకూ తీసుకెళ్లింది.  ఈ సినిమా విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు. ‘నేను రౌడీనే’ విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా నయనతార స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. విఘ్నేశ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు.


‘‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడీనే’. 9 ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు. ఈ సినిమా గురించి విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను రౌడీనే’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించగా వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది’ అని అన్నారు.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM