ఢిల్లీలో 'కంగువ' టీమ్

by సూర్య | Mon, Oct 21, 2024, 06:13 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. కోలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కంగువ ఒకటి. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటు లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ముంబైలో అద్భుతమైన కిక్‌ఆఫ్ తర్వాత బృందం ఢిల్లీకి వెళ్లింది. అక్కడ సూర్య, దిశా పటానీ మరియు బాబీ డియోల్ బహిరంగ కార్యక్రమంలో అభిమానులతో సంభాషించారు. ఢిల్లీ ప్రజల నుంచి వచ్చిన ఉత్సాహభరితమైన స్పందన పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ 26, 2024న గ్రాండ్ లెవెల్లో జరగనుంది. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మాగ్నమ్ ఓపస్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM