అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ని చూపించలేదట !

by సూర్య | Fri, Jun 14, 2019, 04:04 PM

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న మూవీ “మన్మధుడు 2”. నటుడు రాహుల్ రవీంద్ర దర్శకుడిగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఐతే నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.వయసు మీద పడినా పెళ్లికాని మధ్య వయస్కుడిగా నాగార్జున నటన బాగుంది.


ఈ టీజర్ లో ఒక్క హీరోయిన్ కూడా కనిపించకపోవడం ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురిచేసింది. ఇదే విషయమై దర్శకుడు రాహుల్ రవీంద్రను సంప్రదించగా ఆయన కొన్ని ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ మూవీలో రకుల్ తో పాటు నటిస్తున్న కీర్తి సురేష్, సమంత కేవలం అతిధి పాత్రలలో మాత్రమే కనిపిస్తారట. ఫుల్ టైం హీరోయిన్ మాత్రం రకుల్ ఒక్కరే. టీజర్ లో హీరోయిన్ ని చూపించక పోవడానికి కారణం హీరోయిన్ పై ప్రత్యేకంగా ఓ టీజర్ ని దర్శకుడు కట్ చేసారంట. అందుకే రకుల్ ని మొదటి టీజర్ లో చూపించలేదు అని ఆయన తెలిపారు. మన్మధుడు 2 ఆగస్టు 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM