$850K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్

by సూర్య | Fri, Sep 20, 2024, 03:12 PM

శ్రీ సింహ కోడూరి మరియు సత్య ప్రధాన పాత్రలలో నటించిన "మత్తు వదలారా" సినిమా హిట్ గా నిలిచింది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా సీక్వెల్‌తో తిరిగి వచ్చింది. ఒరిజినల్ స్టార్స్ శ్రీ సింహ కోడూరి మరియు సత్య నటించిన "మత్తు వదలారా 2" ట్విస్ట్‌లు, నవ్వులు మరియు హై-ఆక్టేన్ యాక్షన్‌తో నిండిన కొత్త సాహసంతో సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యొక్క USA రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ప్రత్యంగిర సినిమాస్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీమియర్ గ్రాస్ USAలో $850K మార్క్ ని చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM