ఈ చిత్రం నాకు జీవితాన్ని ఇచ్చింది

by సూర్య | Fri, Dec 01, 2023, 05:06 PM

రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అక్కర్లేని కథానాయిక. ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయైున రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్గా  తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్‌ చేసింది. ఆమె తెలుగులో నటించిన రెండో చిత్రం. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’  సందీప్‌ కిషన్ కు జోడీగా నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనకు జీవితాన్ని ఇచ్చిన చిత్రమంటూ సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా గురించి ఓ పోస్ట్‌ పెట్టింది రకుల్‌. ‘‘విజయవంతమైన చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విడుదలై దశాబ్దం పూర్తి చేసుకుంది. కెరీర్‌ బిగినింగ్‌లో నా జర్నీకి ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ చిత్రం నాకు జీవితాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్రత్యేకమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి, చిత్రబృందానికి ధన్యవాదాలు. ఈ చిత్రంతోనే నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించిన ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్‌’’ అని పోస్ట్‌లో పేర్కొంది రకుల్‌. ఆమె తెలుగు తెరపై కనిపించి రెండున్నరేళ్లు కావొస్తుంది. 'కొండ పొలం’ తర్వాత తెలుగులో మరో చిత్రంలో కనిపించలేదు. ఇప్పుడు ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. ప్రస్తుతం తమిళంలో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన2’, హిందీలో ‘అయలాన్‌’ సినిమాలతో బిజీగా ఉంది. రకుల్‌ ఈ ఏడాదితో టాలీవుడ్‌కి ఎంటీర ఇచ్చి పుష్కర కాలం పూర్తి చేసుకుంది. 

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM