ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్

by సూర్య | Sat, Sep 21, 2024, 08:01 PM

తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రకాష్‌రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. 'ప్రకాష్‌రాజ్‌ మీరు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? #మీ పరిధుల్లో మీరు ఉండండి.' అని మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య ఎటువంటి వార్ నడిచిందో తెలియంది కాదు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం విశేషం. ఆ ఎన్నికలలో మంచు విష్ణు గెలిచి.. ‘మా’ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వీరిద్దరూ కామ్‌గా ఎవరిపని వారు చేసుకుంటూ వెళుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకూ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై మాటల యుద్ధానికి దిగారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM