అంబానీ ఈవెంట్లో ప్రియాంక చోప్రా బోల్డ్ షో

by సూర్య | Sat, Apr 01, 2023, 10:23 AM

నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) లాంచింగ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ తారలందరూ ఈవెంట్లో కొలువయ్యారు. వీరిలో ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త నిక్ జోనాస్ తో పాటు ఈ NMACC లాంఛింగ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ కార్యక్రమానికి హాలీవుడ్ టచ్ ఇచ్చారు. గ్లోబల్ హీరోయిన్ గా ఇంటర్నేషనల్ ట్రెండ్ ఫాలో అయ్యారు. అర్థనగ్న సౌందర్యంతో ఈవెంట్ కి ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చెప్పాలంటే ప్రియాంక చోప్రా అందరినీ డామినేట్ చేశారు. ప్రియాంక చోప్రాను కెమెరాల్లో బంధించేందుకు బాలీవుడ్ మీడియా పోటీ పడింది. ప్రియాంక చోప్రా ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. 


ముంబైకి దూరమైన ప్రియాంక చోప్రా ఇండియాలో చాలా ఏళ్ల తర్వాత అడుగు పెట్టడం విశేషం. ఇటీవల బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికన్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఉద్దేశపూర్వకంగా అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయి. బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేక పోయాను. పాలిటిక్స్ చేయడం నాకు రాదు. అందుకే బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకున్నాను, అన్నారు. 


Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM