by సూర్య | Thu, Feb 02, 2023, 09:14 AM
నేషనల్ అవార్డు విన్నర్, "కలర్ ఫోటో" దర్శకుడు సందీప్ రాజ్ అందించిన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో మరో డైరెక్టర్ గంగాధర్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లింగ్ డ్రామా "ముఖచిత్రం". ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కీరోల్ ప్లే చేసారు.
వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 9న థియేటర్లలో విడుదలై, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ముఖచిత్రం డిజిటల్ సందడి చెయ్యడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 3 వ తేదీ నుండి అంటే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి ముఖచిత్రం ఆహా ఓటిటిలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ సినిమాను పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు.
Latest News