by సూర్య | Mon, Dec 05, 2022, 10:25 AM
తన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో విశేష అభిమానాన్ని సంపాదించుకున్న హీరో సత్యదేవ్. మొదటిసారి ఔటండౌట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సున్నితమైన ప్రేమకథలో ముగ్గురు హీరోయిన్లు.. తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి. పలుమార్లు వాయిదాపడి ఈ శుక్రవారమే థియేటర్లకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే, హిట్ 2 సినిమాతో ప్రెజెంట్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన అడివిశేష్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.
Latest News