by సూర్య | Tue, Nov 29, 2022, 02:33 PM
కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల జ్యూరీ హెడ్ నడావ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదొక అసభ్యకర చిత్రమని, ప్రచారం కోసం తీసిందని అన్నారు. ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలాంటి చిత్రాన్ని ప్రదర్శించడం తమను కలచివేసిందని, షాక్కు గురిచేసిందని అన్నారు. కశ్మీరీ పండిట్ల మారణకాండపై తీసిన ఈ సినిమాను ఎంతో కొనియాడిన బీజేపీ తాము అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. అయితే ఈ సినిమా ఏకపక్షంగా ఉందని, దురుద్దేశంతో తీశారని పలువురు విమర్శించారు. భిన్న వర్గాల్లో శత్రుత్వం పెంచేలా ఉందంటూ ఈ సినిమాను మేలో సింగపూర్ నిషేధించింది.
Latest News