by సూర్య | Tue, Nov 29, 2022, 12:55 PM
‘ఆర్ ఎక్స్ 100’తో నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కేరీర్ మలుపు తిరిగింది. మోడల్ గా, సీరియల్ యాక్ట్రెస్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కిచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. తొలిచిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో పాయల్ కుర్ర హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసింది. ఈ సినిమా తర్వాత నపాయల్ కేరీర్ టర్న్ అయ్యింది. ఆ క్రేజ్ రవితేజ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పిచింది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు దర్శకనిర్మాత కంట్లోనూ పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే పలు ఈవెంట్లకూ హాజరవుతూ రచ్చ చేస్తోంది. తాజాగా పాయల్ యోషితా హౌజింగ్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెంకడ్ యానివర్సీ ఈవెంట్ కు హాజరైంది.