by సూర్య | Sun, Nov 27, 2022, 10:03 AM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో దొంగతనం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదల కానుంది.
ఈ రోజుల్లో సినీతారలందరూ సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతుంటే, అజిత్ మాత్రం సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికీ అజిత్ కానీ, ఆయన భార్య షాలిని కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లోనూ లేరు.
లేటెస్ట్ గా షాలిని అజిత్ కుమార్ పేరిట ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త అకౌంట్ కనిపిస్తుంది. ఒక వారం క్రితమే ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యబడింది. ఇందులో ఒకేఒక్క పోస్ట్ ఉంది. షాలిని అండ్ అజిత్ కలిసిదిగిన అన్ సీన్ పిక్ అది. దీంతో షాలిని సోషల్ మీడియా డిబట్ చేసిందని తెలుస్తుంది.
Latest News