by సూర్య | Sun, Nov 27, 2022, 09:52 AM
26 నవంబర్ ... ఏ భారతదేశ పౌరుడు జీవితంలో మర్చిపోలేని చీకటి రోజు. ముంబై లోని తాజ్ హోటల్ లో టెర్రరిజం పేరిట ఆటవికులు వీరంగం చేసిన రోజు. భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా ధైర్యంగా వారితో పోరాడి... ఎంతోమంది దేశవిదేశ అమాయక ప్రజలను కాపాడిన రోజు... ఈ పోరాటంలో దేశసైనికులు వీరమరణం పొందిన రోజు...
ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అడివిశేష్ ముంబై వెళ్లి అక్కడ 26/11 వీరసైనికుల స్మారక చిహ్నాన్ని దర్శించుకుని ఘననివాళి సమర్పించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి తండ్రులతో కలిసి శేష్ సైనికులకు నివాళి అర్పించడం జరిగింది.
Latest News