by సూర్య | Sat, Aug 06, 2022, 06:42 PM
చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, ఇండియాస్ మిస్టికల్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "కార్తికేయ 2". అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
కొంచెం సేపటి క్రితమే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. స్టన్నింగ్ విజువల్స్ తో, సూపర్ బీజీఎమ్ తో ట్రైలర్ టెర్రిఫిక్ గా సాగింది. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, వెండితెరపై కార్తికేయ మ్యాజిక్ ఆవిష్కృతమవ్వడమే తరువాయి. ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేలా ఉన్నారు. పోతే, ఈ చిత్రం ఆగస్టు 13న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.