by సూర్య | Tue, Nov 23, 2021, 08:46 AM
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నటి కరోనా కాటుకు గురైంది. మరాఠీ చిత్ర పరిశ్రమ, టీవీ సీరియల్స్లో నటించిన మాధవి గోగటే (58) కన్నుమూశారు. ఇటీవల మాధవి కరోనా బారిన పడింది. ముంబైలోని సెవెన్ హిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు.
Latest News