by సూర్య | Sat, Oct 23, 2021, 01:59 PM
అడవి శేష్ ప్రస్తుతం మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేజర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తుండగా.. ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ రోజునుండి ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. జులై 2 న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్.
Latest News