by సూర్య | Sat, Oct 23, 2021, 02:27 PM
సెలబ్రిటీలపై నోరు పారేసుకోవడం, లేదా ఎలాగు వాళ్ళకు కన్పించము కదా అని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేయడం, నెగెటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొందరు. కానీ దానికి కూడా పరిమితి ఉంటుంది. అది దాటిందంటే మాత్రం సోషల్ మీడియా చాటున దాగి ఇలాంటి పనులు చేసేవారు కష్టాల బారిన పడక తప్పదు. తాజాగా అలాగే సోషల్ మీడియా ద్వారా టార్చర్ చేస్తున్న ఓ వ్యక్తిపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్ అయ్యింది. నీకేంట్రా నొప్పి ? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరంటే అరియనా. అసలు ఏం జరిగింది అంటే ?
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అరియనా ఫోటోలను మర్ఫింగ్ చేసి పెడుతున్నాడట ఓ వ్యక్తి. ఎన్నిసార్లు ఆ పేజ్ ను బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ కొత్త పేజ్ ఓపెన్ చేసి మెంటల్ టార్చర్ చేస్తున్నాడట. ఇక ఓపిక నశించిన అరియనా నేరుగా ఆ స్క్రీన్ షాట్లు తీసుకెళ్లి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిందట. ఈ విషయాన్నీ అరియనా స్వయంగా వెల్లడించింది. “నీకేంట్రా నొప్పి ? ఎందుకంత వ్యక్తిగత పగ, అసూయ? రెడీగా ఉండు. నువ్వు ఎవడో నాకు తెలియాలి పగిలిపోద్ది నీకు. ఎందుకురా అంత కుళ్ళు?” అంటూ ఫైర్ అయ్యింది. కాగా బిగ్ బాస్ తరువాత అరియనా పలు షోలలో కల్పిస్తున్న విషయం తెలిసిందే.
Latest News