by సూర్య | Fri, Oct 22, 2021, 12:04 PM
ప్రస్తుతం రామ్చరణ్ ప్రస్తుతం 'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులు రిలీజ్ కి రెడీ గ ఉన్నాయి .అయితే త్వరలో రామ్చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ కాంపౌండ్లోకి అడుగుపెట్టనున్నారు. పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారగణం నటిస్తోంది. కాగా, ఇందులో రామ్చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు అని టాక్. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్లో టక్ చేసుకుని, టై కట్టుకుని స్టైలిష్గా కనిపించారు. మరి రామ్చరణ్ పాత్ర ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్నట్లు ఇటీవల విడుదలైన 'రిపబ్లిక్'లో సాయితేజ్ కలెక్టర్గా నటించారు.
Latest News