by సూర్య | Fri, Oct 22, 2021, 11:48 AM
కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోంది. మరోవైపు నిర్మాణ దశల్లో ఉన్న ప్రాజెక్టులలో నేచురల్ స్టార్ నాని 'దసరా'తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. 'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. భారీగా పారితోషికాన్ని పెంచేసిందని టాక్ నడుస్తోంది.తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం 'దసరా' చిత్రానికి కీర్తి సురేష్ 3 కోట్ల రూపాయలు అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల 'దసరా' సినిమా మోషన్ పోస్టర్ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ స్వరకర్త సంతోష్ నారాయణన్ నేపథ్య స్కోర్, సంగీతం అందించబోతున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest News