by సూర్య | Wed, Jun 09, 2021, 12:13 PM
ఈ వేసవి కరోనా ఖాతాలో కొట్టుకెళ్లిపోయింది. చిత్రసీమకు వేసవి రూపంలో బంగారం లాంటి సీజన్ ఉంటుంది. అదంతా కరోనా దెబ్బకు మటాష్ అయిపోయింది. అయితే… జూలై నుంచి చిత్రీకరణలు మొదలవుతాయని, ఆగస్టు నాటికి థియేటర్ల తాళాలు తెరచుకుంటాయని వస్తున్న వార్తలు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పరిస్థితులు చక్కబడతాయన్న ధీమా.. తమ సినిమాలు మళ్లీ థియేటర్లలో ఆడతాయన్న నమ్మకం నిర్మాతల్లో కనిపిస్తోంది.ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'రాధే శ్యామ్' సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ పాటికే ఈ సినిమా థియేటర్లకు వచ్చి ఉండవలసింది. కానీ కరోనా కారణంగా షూటింగుకి ఆటంకాలు ఎదురౌతూ ఉండటం వలన, ఆలస్యమవుతూ వచ్చింది. బహుశా దసరాకి ఈ సినిమాను విడుదల చేయవచ్చని అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించాడు. కృష్ణంరాజు .. భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Latest News