by సూర్య | Sat, Jun 05, 2021, 12:35 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకు చేరుకోగా కరోనా విజృంబణ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాలతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఆ సినిమా తరవాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేంసింది. అయితే తాజా టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ను అనుకుంటున్నారట. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ఇప్పటికే జాహ్నవి కపూర్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు బోణీకపూర్ ను సంప్రదించిందట. అయితే దానిపై బోణీకపూర్ ఇంకా నిర్ణయం తీసకోలేదని తెలుస్తోంది. ఒకవేళ బోణీకపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జాహ్నవి ఎన్టీఆర్ తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా జాహ్నవి కపూర్ దడక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా మొదటి సినిమాలోనే తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకుంది. ఇక ఇప్పటి వరకూ చాలా సార్లు జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. మరి ఈసారైనా ఉంటుందో లేదో చూడాలి.
Latest News