by సూర్య | Sat, Jun 05, 2021, 12:44 PM
టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకునే వారికి అనుష్కను మించిన ఛాయిస్ లేదు. అందుకే ఆమె కోసం నిర్మాతలు, దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ స్వీటీ మాత్రం సినిమాలు బాగా తగ్గించేసింది. ‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె ఒప్పుకున్నది ఒక్కటే చిత్రం. అదే యువీ క్రియేషన్స్ ప్రాజెక్ట్. చాలా నెలల కృతమే ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పింది. కానీ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో యువీ నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూపుల్లో పడ్డారు. కానీ ఆశ్చర్యంగా అనుష్క చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇన్నాళ్లు బరువు తగ్గే పనిలో ఉన్న ఆమె టార్గెట్ రీచ్ అవ్వడంతో కెమెరా ముందుకు రావడానికి సిద్ధమైందట. అనుష్క చిత్రానికి వెరైటీ టైటిల్ అనుష్క కథానాయికగా 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడుగా నటించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. ఇక ఈ చిత్రానికి 'మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట.
Latest News