by సూర్య | Thu, Jun 03, 2021, 11:13 AM
పూరి జగన్నాథ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు సెట్ కానుందట. పవన్ కల్యాణ్ క్రేజ్ కి తగినట్టుగా .. తన స్టైల్ లోనే పూరి ఒక కథను తయారు చేశాడని అంటున్నారు. ఆ కథతో పవన్ తో సినిమా చేయడానికి ఒక పెద్ద బ్యానర్ రంగంలోకి దిగిందట. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గతంలో పూరి - పవన్ కాంబినేషన్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా వచ్చింది కానీ పెద్దగా ఆడలేదు. మరి ఇప్పుడేమో ఈ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమే అయినా అందుకు చాలా సమయం పడుతుంది.ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమా కోసం లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.
Latest News